మీడియాపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇవాళ వైసీపీ చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తోందని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని అమ్ముడుపోయిన, చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నామన్నారు. [more]

Update: 2019-03-05 11:00 GMT

ఇవాళ వైసీపీ చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తోందని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని అమ్ముడుపోయిన, చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ మీడియా అబద్దాలను నిజాలు చేస్తాయని, నిజాలను అబద్ధాలుగా చూపిస్తాయన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు సమర శంఖారాం సభలో మాట్లాడుతూ… తెలంగాణలోనూ ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి సర్వే పేరుతో వచ్చారని, ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ గెలుస్తుందని ఈ యెల్లో మీడియా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఈ జిత్తులమారి నక్కల జిత్తులను కచ్చితంగా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసులను చంద్రబాబు దారుణంగా వాడుకుంటున్నారని, పోలీసులను చూస్తుంటే తనకే జాలిగా ఉందన్నారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ చేయాలని, కానీ ఏపీలో మాత్రం మూడు సింహాల వెనుక ఉన్న నక్కలకు సెల్యూట్ చేయాల్సి వస్తుందన్నారు.

Tags:    

Similar News