పొత్తులపై జగన్ కీలక వ్యాఖ్యలు

రానున్న ఎన్నికల్లో పొత్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ‘అన్న పిలుపు’ [more]

Update: 2019-01-31 12:04 GMT

రానున్న ఎన్నికల్లో పొత్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ‘అన్న పిలుపు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… కేంద్రంలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ వచ్చే అవకాశం ఉన్నందున కచ్చితంగా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారనుందన్నారు. జాతీయ పార్టీల మాటలు నమ్మి ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుంటే మోసపోతామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసిన పార్టీతోనే కలుస్తామని స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని, అన్ని రాష్ట్రాలకూ రైల్వే జోన్ ఉన్నప్పుడు ఏపీకి ఎందుకుండదని ఆయన ప్రశ్నించారు. కచ్చితంగా ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ కూడా సాధిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News