నాలుగోసారి అయినా నిలిచేనా?

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తన మద్దతుదారులతో కలసి రాజ్ భవన్ కు ర్యాలీగా తరలి [more]

Update: 2019-07-26 13:02 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తన మద్దతుదారులతో కలసి రాజ్ భవన్ కు ర్యాలీగా తరలి వచ్చారు. యడ్యూరప్ప చేత గవర్నర్ వాజూబాయి వాలా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు యడ్యూరప్ప వివిధ ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లి ముఖ్యనేతలతో చర్చించారు. కాగా యడ్యూరప్ప ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. బలనిరూపణ తర్వాతే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. సోమవారం యడ్యూరప్ప శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్లయింది. 2007, 2008, 2018 లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Tags:    

Similar News