మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీ లు వైసీపీ ఖాతాలోకే

మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులున్నాయి. ఇక్కడ కూడా ఎవరూ పోటీ చేయకపోవడంతో వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధించినట్లే. టీడీపీ తరుపున [more]

Update: 2021-03-04 01:00 GMT

మాచర్ల మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులున్నాయి. ఇక్కడ కూడా ఎవరూ పోటీ చేయకపోవడంతో వైసీపీ అభ్యర్థులందరూ విజయం సాధించినట్లే. టీడీపీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు, డమ్మీ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఇక్కడ 31 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీలోని 33 వార్డులను కూడా వైసీపీ గెలుచుకుంది. దీంతో పిడుగురాళ్ల మున్సిపాలిటీ కూడా వైసీపీ పరమయింది.

Tags:    

Similar News