బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల దీక్ష భగ్నం

Update: 2018-04-11 06:56 GMT

వైసీపీ ఎంపీల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వైసీపీ ఎంపీలు మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. తాము రామని చెబుతున్నా పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత ఆరురోజులుగా వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ ల ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పటికే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరో ఇద్దరు ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డిలు మాత్రమే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వారి ఆరోగ్యం కూడా క్షీణించిందని వైద్యులు తెలపడంతో వారిని బలవంతంగా పోలీసులు ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం తరలించారు. ఈసందర్భంగా వారిని ఆసుపత్రికి తరలించవద్దంటూ వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏపీ భవన్ లో నెలకొన్నాయి.

Similar News