ఉగ్రదాడిపై బాబు స్పందన దిగజారుడుతనం

ఉగ్రవాడితో దేశ ప్రజలకు రక్త మరిగిపోతోందని, పాకిస్థాన్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా కోరుకుంటుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దాడిపై స్పందించిన తీరు దిగజారుడుతనమని వైసీపీ [more]

Update: 2019-02-21 07:06 GMT

ఉగ్రవాడితో దేశ ప్రజలకు రక్త మరిగిపోతోందని, పాకిస్థాన్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా కోరుకుంటుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దాడిపై స్పందించిన తీరు దిగజారుడుతనమని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. గురువారం ఆమె తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ… ఉగ్రవాద దాడికి బాధ్యతగా మోడీని రాజీనామా చేయడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మె వ్యాఖ్యానించారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 30 మంది సామాన్యులు చనిపోతే బాబు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న తన మీటింగ్ కోసం రైతును పోలీసులు కొట్టి చంపితే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. వైసీపీలోకి టీడీపీ నేతలు చేర్చకుంటుంటే మోడీ, కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించడం సరికాదన్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నప్పుడు మోడీ, కేసీఆర్ తో కలిసి చంద్రబాబు కుట్ర చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న రౌడీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని ఆమె ఆరోపించారు.

Tags:    

Similar News