బ్రేకింగ్: తెలుగుదేశంలోకి వైసీపీ నేత

కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ [more]

Update: 2019-02-28 13:04 GMT

కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడారు. తర్వాత ఆయన చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మొదట జనసేనలో చేరాలని ఆయన భావించారు. కానీ, ప్రస్తుత కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో సునీల్ టీడీపీ వైపు మొగ్గు చూపారు. టీడీపీలోకి వెళ్తే ఎంపీ టిక్కెట్ లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. రేపు ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News