రాజధాని రైతులకు తొలిసారి వైసీపీ ఎంపీ…?

తొలిసారి అమరావతిలో రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను వైసీపీ నేత పరామర్శించారు. ఇప్పటి వరకూ వైసీపీ నేతలు ఎవ్వరూ రాజధాని రైతుల వద్దకు రాలేదు. అయితే [more]

Update: 2020-01-31 11:44 GMT

తొలిసారి అమరావతిలో రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను వైసీపీ నేత పరామర్శించారు. ఇప్పటి వరకూ వైసీపీ నేతలు ఎవ్వరూ రాజధాని రైతుల వద్దకు రాలేదు. అయితే ఈరోజు నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మందడం వచ్చి రైతులను కలుసుకున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారికి ఎవరికీ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే కమిటీ అందరి అభిప్రాయాలను తీసుకుంటుందని చెప్పారు. కమిటీకి మీ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. ఆందోళన చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని కోరారు. అయితే రైతులు మాత్రం రాజధానిలో అమరావతి ఉంటుందా? లేదా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎంపీ ఎదుట రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి వచ్చి రైతులను పరామర్శించడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News