బ్రేకింగ్ : అన్ని సంఘటనలపై సీబీఐ.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం?

తమపై మతపరమైన దుష్ప్రచారానికి దిగుతుండటంపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కావాలని కొందరు మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడుతుంది. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి [more]

Update: 2020-09-12 12:47 GMT

తమపై మతపరమైన దుష్ప్రచారానికి దిగుతుండటంపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కావాలని కొందరు మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడుతుంది. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన అన్ని సంఘటనలను సీబీఐ విచారణలోకి చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. నెల్లూరు రధం దగ్దం ఘటన, పిఠాపురంలో విగ్రహాలు మాయం, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అన్యమత ప్రచారం, టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం వంటి వాటిపై సీబీఐ దర్యాప్తు లో చేర్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతపరమైన కుట్ర జరుగుతోందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.

Tags:    

Similar News