yanmala : బీసీలకు చేసింది ఇదేనా?

మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సూటిగా ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీలను జగన్ [more]

Update: 2021-09-15 07:48 GMT

మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సూటిగా ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీలను జగన్ ప్రభుత్వం అడుగడుగునా అణిచివేస్తుందన్నారు. జీవో నెంబరు 217తో మత్స్యకార సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి నిధులు ఎంత కేటాయించారో చెప్పగలరా? అని యనమల రామకృష్ణుడు నిలదీశారు. బీసీలకు సంబంధించి 17 ప్రశ్నలతో ఒక ప్రెస్ నోట్ ను యనమల రామకృష్ణుడు విడుదల చేశారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని యనమల రామకృష్ణుడు కోరారు.

Tags:    

Similar News