అమరావతి అంటేనే జగన్ కు అలర్జీ

అమరావతిపైన జగన్ అలెర్జీ పెంచుకున్నారని మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు అన్నారు. ఏ నిబంధన ప్రకారం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారో చెప్పాలన్నారు. శాసనమండలిలో అన్నీ నిబంధనల [more]

Update: 2020-01-23 13:06 GMT

అమరావతిపైన జగన్ అలెర్జీ పెంచుకున్నారని మాజీ మంత్రి యనమల రామకృష‌్ణుడు అన్నారు. ఏ నిబంధన ప్రకారం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారో చెప్పాలన్నారు. శాసనమండలిలో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. రూల్ బుక్ చూస్తే అర్థమవుతుందన్నారు. సెలెక్ట్ కమిటీ అంటే ప్రజల అభిప్రాయాన్ని సేకరించడమేనని యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీలో మేధావులతో పాటు క్రిమినల్స్ కూడా ఉన్నారన్నారు యనమల. శాసనమండలిని తప్పుపట్టే జగన్ అసెంబ్లీలో ఏ మేరకు నిబంధలను పాటిస్తున్నారో చెప్పాలన్నారు. క్రిమినల్ చేతికి తాళాలిచ్చినట్లయిందన్నారు. ప్రజల మీద కూడా జగన్ కు కోపం అన్నారు. జగన్ కు రూల్స్ తెలియవని, ఆయనకు చెప్పే ధైర్యం ఎవరూ చేయరని యనమల అన్నారు.

Tags:    

Similar News