జగన్ బాధ్యతారాహిత్యమే కొంపముంచింది

కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఆంధ్రప్రదేశ్ ను ముంచేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందన్నాు. తయారీ [more]

Update: 2021-05-16 00:48 GMT

కరోనా కన్నా జగన్ బాధ్యతారాహిత్యమే ఆంధ్రప్రదేశ్ ను ముంచేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందన్నాు. తయారీ రంగంపై జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని యనమల రామకృష్ణుడు అన్నారు. కోవిడ్ రెండు దశల్లో చేసిన ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం విడుదలచేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. తయారీ రంగంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. పారిశ్రామిక పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని యనమల రామకృష్ణుడు అన్నారు. కరోనా రెండో దశలో ఏపీ తిరోగమన వృద్ధి ఖాయమని యనమల స్పష్టం చేశారు.

Tags:    

Similar News