జగన్ కే అది చెల్లింది

అధికారుల్లోనూ సామాజికవర్గం చూడటం జగన్ కే చెల్లిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగితే వారు నిజాయితీగా, నిస్వార్థంగా [more]

Update: 2020-02-10 07:01 GMT

అధికారుల్లోనూ సామాజికవర్గం చూడటం జగన్ కే చెల్లిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగితే వారు నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయలేరన్నారు. మళ్లీ ప్రభుత్వం మారితే వేరు సామాజికవర్గం టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఏనాడూ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. అధికారులు ఈ విషయాన్ని ఆలోచించుకుని ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలని యనమల పిలుపునిచ్చారు. అధికారులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని యనమల ఆరోపించారు. ఇప్పటి వరకూ టీడీపీ నేతలపైనే కక్ష సాధించిందని, ప్రస్తుతం అధికారులపై చర్యలకు దిగిందన్నారు. శాసనమండలిలో బిల్లులను తాము అడ్డుకోలేదని సెలెక్ట్ కమిటీకి మాత్రమే పంపామని యనమల తెలిపారు.

Tags:    

Similar News