ఫ్యాన్ రెక్కలు మూడు… రాజధానులు మూడు

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ సింబల్ మేరకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ [more]

Update: 2020-01-02 06:09 GMT

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ సింబల్ మేరకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ గుర్తు ఫ్యాన్ కు మూడు రెక్కలున్నట్లుగానే ఏపీలోనూ మూడు రాజధానులను చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తన, తన అనుచరుల ఆస్తులు పెంచుకోవడం కోసమే జగన్ ఈ ప్రతిపాదనను తెచ్చారన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలోచన చేసిన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. మూడు చోట్ల మూడు ప్యాలెస్ లు కట్టుకుంటారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందన్నారు. తెల్ల కార్డులను కూడా తొలగిస్తుండటంతో దాదాపు కోటి మంది వీధిన పడుతున్నారని యనమల ఆందోళన వ్యక్తం చేశారు

Tags:    

Similar News