శుక్రవారమైతే జగన్ పరిస్థితి ఏంటి?

Update: 2018-08-21 13:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు శుక్రవారం జరిగితే వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్న జగన్ తమ అధినేత నారా చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే సహించబోమన్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం బాండ్లను ఇష్యూ చేస్తే దానిని కూడా తప్పుపట్టడం ఒక ప్రతిపక్ష నేతకే చెల్లిందన్నారు. చంద్రబాబు ఇమేజ్ ను చూసే బాండ్లను అంత పెద్ద సంఖ్యలో ప్రజలు కొనుగోలు చేశారని బుద్దా వెంకన్న చెప్పారు. అవినీతిపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జగన్ పాదయాత్ర ద్వారా సాధించిందేమీ లేదని, చంద్రబాబును విమర్శించడానికే పాదయాత్ర చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.

Similar News