వన్ డే రిలాక్స్ అయిన జగన్....?

Update: 2018-06-01 02:59 GMT

ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్ పాదయాత్రను తిరిగి ఈరోజు ప్రారంభించారు. జగన్ కు తీవ్ర జ్వరం ఉండటంతో వైద్యుల సూచన మేరకు జగన్ గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆయన సరిపల్లిలోని శిబిరంలోనే నిన్నంతా విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిగా జ్వరం తగ్గడంతో ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు జగన్ పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో జరగనుంది. జగన్ కు తీవ్ర అస్వస్థత అని తెలియడంతో ఆయన సతీమణి వైఎస్ భారతి వచ్చి జగన్ వద్దనే నిన్నంతా ఉన్నారు. జగన్ ఈరోజు చిట్టివరం క్రాస్ రోడ్స్, రాజోలు క్రాస్ రోడ్స్, దిగమర్రు, పెద్ద గరువు క్రాస్ రోడ్స్ మీదుగా పాలకొల్లు వరకూ పాదయాత్ర జరుగుతుంది.

Similar News