"పవర్" ఇస్తే పెనం మీద నుంచి పొయ్యిలోకే....!

Update: 2018-08-13 04:24 GMT

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చినా పెనంలో నుంచి పొయ్యిలో పడేనట్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్ కు అధికారాన్ని ఇచ్చినా ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండబోదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తాము అనుకోవడం లేదని రామకృష్ణ అన్నారు. కొత్త రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జనసేన, వామపక్షాల వల్లనే రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే అసెంబ్లీకి రాకుండా ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు.

Similar News