బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్చి కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి కరెంట్‌ స్థంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో 11 మంది దుర్మరణం [more]

Update: 2020-05-14 14:22 GMT

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్చి కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి కరెంట్‌ స్థంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. రాపర్ల సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్థంభం విరిగిపడి ట్రాక్టర్‌ మీద పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్‌లో సుమారు 30మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు నాగులుప్పలపాడు, మాచవరానికి చెందినవారుగా భావిస్తున్నారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

Tags:    

Similar News