ఏపీ సీఎం ను మారిస్తేనే బెటర్

రెండున్నరేళ్లకు మంత్రి వర్గమే కాదని, ముఖ్యమంత్రి కూడా మారతారని ఏపీ బీజేపీనేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు [more]

Update: 2020-12-09 07:26 GMT

రెండున్నరేళ్లకు మంత్రి వర్గమే కాదని, ముఖ్యమంత్రి కూడా మారతారని ఏపీ బీజేపీనేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో పోల్చారు. ప్రజల సమస్యలు జగన్ కు పట్టవని చెప్పారు. ముఖ్యమంత్రిగా భారతి వస్తే కొద్ది సమస్యలైనా పరిష్కారానికి నోచుకుంటాయని విష్ణుకుమార్ రాజు తెలిపారు. భారతిని వెంటనే జగన్ సీఎం చేసి ఏపీ తొలి మహిళ ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News