జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే?

జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే వినాయక చవితి పండగను ఇంట్లోనూ చేసుకోనివ్వరని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వినాయక చవితి పండగపై ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. [more]

Update: 2021-09-08 03:54 GMT

జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే వినాయక చవితి పండగను ఇంట్లోనూ చేసుకోనివ్వరని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. వినాయక చవితి పండగపై ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను ముఖ్యమంత్రి జగన్ దెబ్బతీస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. పొరపాటున కూడా మరోసారి సీఎం గా జగన్ కాకూడదన్నారు. ఆప్ఘన్ లో తాలిబన్ల పాలనను మించిపోయిందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. జగన్ పాలనలో అన్నీ వినాశనమేనని, తొలుత జగన్ తన పై ఉన్న కేసుల నుంచి బయటపడాలని ఆయన కోరారు.

Tags:    

Similar News