విజయసాయి కూడా పాదయాత్ర

Update: 2018-04-25 07:28 GMT

విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖ నగరంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర ఉంటుందని చెప్పారు. మే 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు విశాఖ నగర కార్పొరేషన్ పరిధిలోని 72 వార్డుల్లో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తారు. మొత్తం 180 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. విశాఖ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వైసీపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వంచన దీక్ష చేస్తోంది.

Similar News