కోర్టు నుంచి బయటకు రాగానే?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఫైరయ్యారు. నాలుగు వేల ఎకరాల కోసం ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనేక డ్రామాలు చేస్తున్నారన్నారు. [more]

Update: 2020-01-10 12:21 GMT

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఫైరయ్యారు. నాలుగు వేల ఎకరాల కోసం ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనేక డ్రామాలు చేస్తున్నారన్నారు. జోలె పట్టి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీలు, బంధువుల ఆస్తులు లక్ష కోట్ల పైచిలుకు ఉంటాయని, ఊ అంటే వందల కోట్లు విరాళాలిచ్చే వారుండగా జోలె పట్టడమెందుకని ప్రశ్నించారు. ఒక ప్రాణం పోతే రాబందుల్లా మీద పడి హడావిడి చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈరోజు సీబీఐ కేసులో కోర్టుకు హాజరయిన విజయసాయిరెడ్డి కోర్టు నుంచి బయటకు రాగానే ఈ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News