65కి పోటీ చేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారా..?

జ‌న‌సేన క‌చ్చితంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి [more]

Update: 2019-04-19 06:46 GMT

జ‌న‌సేన క‌చ్చితంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు స్వంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుంగు అనుచ‌రుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణేమో 88 స్థానాల్లో గెలిచి జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని జోస్యం చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న ద‌ర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్న‌ట్లు రాసాడ‌ని, ఇది కూడా చంద్ర‌బాబు బ్రీఫింగేనా అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్ర‌బాబుపైన కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీలో ఐదేళ్లు పంచ‌భూతాల‌ను హాంఫ‌ట్ చేసిన బాబు సిగ్గులేకుండా క‌ర్ణాట‌క‌కు వెళ్లి దేశాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా ప్ర‌చారానికి వెళ్తార‌ని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News