బతిమాలి మరీ ప్రచారానికి వెళుతున్నారు

చంద్రబాబు నాయుడు పొరుగుతు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బతిమాలి మరీ ఆహ్వానం తెప్పించుకుంటున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు ఒకరు [more]

Update: 2019-04-24 08:01 GMT

చంద్రబాబు నాయుడు పొరుగుతు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బతిమాలి మరీ ఆహ్వానం తెప్పించుకుంటున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు ఒకరు డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ నాయకులకు ఫోన్లు చేసి గతంలో తమ అధినేత నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ ఏపీకి సమన్యాయం చేసిందని చంద్రబాబు అంటున్నారని.. సోనియాను దెయ్యం అని దూషించిన ఆయన ఇప్పుడ ఆమెను దేవతను చేశారన్నారు. 2014లో బీజేపీ మద్దతుతో 15 శాతం ఓట్లు అప్పనంగా పడి చంద్రబాబు మ్యాజిక్ ఫిగర్ దాటారని అన్నారు. ఇప్పుడు పాల్, పార్టనర్ పవన్ దాటిస్తారని అనుకుంటున్నారు కానీ అంచనా తప్పిందన్నారు. మ్యానిప్యులేషన్లు అన్ని వేళలా పనిచేయవన్నారు. ఈ మేరకు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

Tags:    

Similar News