ఆరోజే నన్ను కేసీఆర్ సస్పెండ్ చేశారు.. విజయశాంతి వెల్లడి

సినీనటి విజయశాంతి బీజేపీలో చేరారు. పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి చేరారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం తొలి నుంచి పోరాడుతున్నానన్నారు. 2005 [more]

Update: 2020-12-07 08:20 GMT

సినీనటి విజయశాంతి బీజేపీలో చేరారు. పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ సమక్షంలో విజయశాంతి చేరారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం తొలి నుంచి పోరాడుతున్నానన్నారు. 2005 లో బీజేపీ నుంచి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీని పెట్టామని చెప్పారు. తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడామన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే తనను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. తన అవసరం ఇక లేదనుకుని పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లో తాను చేరాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు పూర్తిగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే దృష్టి పెడతానని చెప్పారు. కేసీఆర్ తన కుటుంబం కోసమే పార్టీ పెట్టారన్నారు.

Tags:    

Similar News