చివరకు నాలుగింటికే బాబు పరిమితం

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శించారు. తనపై నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు [more]

Update: 2020-07-11 05:59 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబును విమర్శించారు. తనపై నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వలగడని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితమని, ఇక భవిష్యత్ లేదని విజయసాయిరెడ్డి అన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ చంద్రబాబు నమ్మకం కోల్పోతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాల పాటు ఏలిన పార్టీని చంద్రబాబు నాలుగు గ్రామాలకే పరిమితం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News