టేస్టీ ఫుడ్ కోసం మాలోకం ఎంతదూరమైనా?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో లోకేష్ పై విమర్శలు చేశారు. తాడిపత్రికి వెళ్లి లోకేష్ ఏం చేశారని విజయసాయిరెడ్డి [more]

Update: 2020-06-18 05:29 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో లోకేష్ పై విమర్శలు చేశారు. తాడిపత్రికి వెళ్లి లోకేష్ ఏం చేశారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నారా లోకేష్ తాడిపత్రి వెళ్లి 16 రకాల వంటలు చేయించుకుని తిని వచ్చారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టేస్టీ ఫుడ్ కోసం మాలోకం ఎంతదూరమైనా వెళతాడని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును విజయసాయిరెడ్డి వదలిపెట్టలేదు. ఢిల్లీలో అడ్వకేట్ల ముందు తెలుగుదేశం పార్టీ మాజీ నేతలు క్యూకడుతున్నారన్నరాు. బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులూ బాసును కాపాడే ప్రయత్నంలో ఉన్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News