జగన్ ఆదేశాలతో విజయసాయి

మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలోనే రాత్రి బస చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గ్యాస్ లీక్ [more]

Update: 2020-05-12 03:20 GMT

మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలోనే రాత్రి బస చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గ్యాస్ లీక్ అయిన పద్మనాభనగర్ లో నిన్న రాత్రి బస చేశారు. అక్కడే నిద్రపోయారు. బాధితుల్లో ధైర్యం నింపేందుకే తాను రాత్రి బస ఇక్కడ చేసినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. గ్యాస్ లీక్ ఘటనపై కమిటీ ఇచ్చిన నివేదిక అందిన వెంటనే చర్యలు ఉంటాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆరు నెలల పాటు గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News