బ్రేకింగ్ : రాజధానిపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు

పాలన ఒక్కచోటనే ఉండాలని తన అభిప్రాయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు మాట్లాతూ సీఎం, అసెంబ్లీ, సచివాలంయ [more]

Update: 2019-12-25 04:41 GMT

పాలన ఒక్కచోటనే ఉండాలని తన అభిప్రాయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు మాట్లాతూ సీఎం, అసెంబ్లీ, సచివాలంయ హైకోర్టు, అధికారులు అందరూ ఒకచోటనే ఉండాలన్నది తన అభిప్రాయమని వెంకయ్య నాయుడు వెల్లడించారు. అన్నీ ఒకచోటనే ఉంటే పాలనా సౌలభ్యం ఉంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు. తాను అనుభవంతో చెబుతున్నానని, దీనిని రాజకీయం చేయవద్దని వెంకయ్య నాయుడు కోరారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిపై తన అభిప్రాయం అడిగితే ఇదే చెబుతానన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, పాలను కేంద్రీకృతం చేయాలని ఆయన అన్నారు.

Tags:    

Similar News