సమయం వచ్చినప్పుడు చెప్తా

రాజధాని రైతుల విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, ప్రభుత్వం లో లేనని, రాజ్యాంగ పదవిలో ఉన్న తాను ఏమీ బహిరంగంగా [more]

Update: 2019-12-24 14:05 GMT

రాజధాని రైతుల విషయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, ప్రభుత్వం లో లేనని, రాజ్యాంగ పదవిలో ఉన్న తాను ఏమీ బహిరంగంగా మాట్లాడలేనని తెలిపారు. రాజధాని అమరావతి రైతులు వెంకయ్యనాయుడిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ట్రస్టులో రాజకీయాలు మాట్లాడకూడదన్న నిబంధన ఉందని, రైతుల ఆవేదన, బాధ తాను అర్ధం చేసుకోగలనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తాను అసలు కలవకూడదు అని అనుకున్నానని , కానీ ఇంత మంది రావడంతో కలిశానని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఏం మాట్లాడినా అది వివాదం అవుతుందన్నారు. సరైన సమయం వచ్చినపుడు ఏం చేయాలి? ఎవరితో మాట్లాడాలో? తాను చెబుతానని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News