టీఆర్ఎస్ లో అందుకే చేరుతున్నా…

కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. [more]

Update: 2019-01-18 12:05 GMT

కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్రతాప్ రెడ్డి చేరికతో గజ్వేల్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ మారుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లానే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఫలితాలు ఉండాలని, మొత్తం 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నందుకే…

ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ… తాను గజ్వేల్ లో ముంపు ప్రాంత రైతుల పక్షాన పోరాటాలు చేసి లాఠీల దెబ్బలు తిన్నానని, అయితే ఆ ప్రజలు కూడా కేసీఆర్ కే ఓటేశారన్నారు. కేసీఆర్ ఆలోచన సరైనదని, తన ఆలోచన తప్పు అని నిర్ణయించుకొని టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు. 2009, 2014, 2018లో తనను టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా టీఆర్ఎస్ ఆహ్వానించినా తాను రాలేకపోయానని తెలిపారు.

Tags:    

Similar News