వంగవీటి మళ్లీ

విజయవాడ నేత వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనతో దాదాపు నలభై ఐదు నిమిషాలు పాటు వంగవీటి రాధా చర్చలు జరిపారు. [more]

Update: 2019-09-05 14:13 GMT

విజయవాడ నేత వంగవీటి రాధా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనతో దాదాపు నలభై ఐదు నిమిషాలు పాటు వంగవీటి రాధా చర్చలు జరిపారు. రాజమండ్రి వెళ్లిన పవన్ కల్యాణ్ ను రాధా కలవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందే వంగవీటి రాధా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోచేరారు. టీడీపీ వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వంగవీటి రాధాకు వచ్చే అవకాశమే లేదు. టీడీపీకి భవిష్యత్ లేదని భావించి రాధా జనసేనలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్నచర్చ జరుగుతోంది.

Tags:    

Similar News