చంద్రబాబు ఇక పేకప్ చెప్పాల్సిందే

చంద్రబాబు గౌరవంగా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోవడం [more]

Update: 2021-02-19 01:04 GMT

చంద్రబాబు గౌరవంగా ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే బెటర్ అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకోవడం లేదన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుగాలి వీచిందంటే ఇక రాజకీయాలకు ఆయన పేకప్ చెప్పడమే బెటర్ అని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్పఅని, గెలవకుంటే అరాచకమనడం చంద్రబాబుకు అలవాటేనని వంశీ అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నవ్వుతారని కూడా అనుకోకుండా ఎదుటి వారిపై నిందలు మోపుతున్నారన్నారు.

Tags:    

Similar News