మరోసారి ఉగ్రదాడులు.. అమెరికా హెచ్చరిక

కాబూల్ లో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నట్లు అమెరికా హెచ్చరించింది. తమ పౌరులు కాబూల్ విమానాశ్రయం నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. రానున్న 36 గంటలలో ఈ దాడులు జరిగే [more]

Update: 2021-08-29 03:28 GMT

కాబూల్ లో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నట్లు అమెరికా హెచ్చరించింది. తమ పౌరులు కాబూల్ విమానాశ్రయం నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. రానున్న 36 గంటలలో ఈ దాడులు జరిగే అవకాశముందని అమెరికా పేర్కొంది. నిన్న ఐఎస్ఐఎస్ స్థావారాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఐఎస్ఎస్ ఆత్మాహుతి దాడి సూత్రధారి, మరో ఉగ్రవాది హతమయ్యారు. దీంతో అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది. వీలయినంత త్వరగా కాబూల్ నుంచి తరలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News