బ్రేకింగ్ : ఉద్ధవ్ కు అమిత్ షా ఫోన్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అమిత్ షా మాట్లాడారు. [more]

Update: 2020-04-20 08:30 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అమిత్ షా మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతోందని ఉద్దవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మహారాష‌్ట్ర విషయంలో కొంత ఆందోళన చెందుతోంది. అందుకే ఉద్ధవ్ థాక్రే కు అమిత్ షా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News