వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతోఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ లోని కాంటినెంటల్ [more]

Update: 2021-04-15 01:24 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతోఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి స్వయంగా వైద్యురాలు. కరోనా సోకినా అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో ఉండవల్లి శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్పించారు.
ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News