జగన్ కు ఉండవల్లి లేఖ… విచారణ జరిపిస్తారా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. భూముల కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పారు. రాజమండ్రిలోని ఆవ [more]

Update: 2020-06-24 06:34 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. భూముల కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పారు. రాజమండ్రిలోని ఆవ భూముల పై విచారణ జరపాలని ఉండవల్లి ఆ లేఖలో జగన్ ను కోరారు. ఎకరా 45 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని, అంత ధర అక్కడ ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అవినీతిని సమర్థించనని చెప్పిన జగన్ భూముల కొనుగోలులో ఎందుకు స్పందిచడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అధిక ధరలకు భూములు కొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం అర్థం లేనిదని ఉండవల్లి అరుణ్ కుమార్ కొట్టిపారేశారు. ఇసుక విధానంలోనూ ప్రభుత్వానికి ముందు చూపులేదని, ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News