జగన్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ను నిర్లక్ష్యం చేస్తే జగన్ కు రాజకీయంగా [more]

Update: 2020-10-29 08:18 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ను నిర్లక్ష్యం చేస్తే జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీజేపీకి జగన్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. కేసులకు భయపడి జగన్ బీజేపీని ఏమీ అనలేకపోతున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారని ఉండవల్లి అన్నారు. వైఎస్ కుమారుడే పోలవరం ప్రాజెక్టును పట్టించుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని జగన్ కు ఉండవల్లి సలహా ఇచ్చారు. జగన్ చేయకుంటే తానే పోలవరం పై కోర్టుకు వెళ్లనున్నట్లు ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు కూడా పోలవరంను నిర్లక్ష్యం చేసి ఎన్నికల్లో దెబ్బతిన్నాడని ఉండవల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ పై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే జగన్ ను ఏపీ ప్రజలే కాపాడుకుంటారని, బీజేపీకి భయపడవద్దని ఉండవల్లి జగన్ కు సూచించారు. కేసీఆర్ తో సహా అనేక మంది సీఎంలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News