ఎన్ఐఏకి ఏపీ పోలీసుల ఝలక్..!

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి కేసుకు సంబంధించిన ఆధారాలు [more]

Update: 2019-01-17 11:28 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి కేసుకు సంబంధించిన ఆధారాలు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరాకరించారు. ఎన్ఐఏకి ముందు ఏపీ సిట్ పోలీసులు ఈ కేసును విచారించి నిందితుడు పబ్లిసిటీ, సానుభూతి కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును ఎన్ఐఏ విచారణకు స్వీకరించడంతో ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ.. సిట్ ను కోరింది. ఆధారాలు ఇచ్చేందుకు సిట్ నిరాకరించడంతో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News