ఏదైనా కాంగ్రెస్ తోనే సాధ్యం

తిరుపతిలో కాంగ్రెస్ గెలుపు ప్రజలకు అవసరమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తులసిరెెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2021-04-16 01:12 GMT

తిరుపతిలో కాంగ్రెస్ గెలుపు ప్రజలకు అవసరమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తులసిరెెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాడి ఆవులాంటిదని, మిగిలిన పార్టీలు ఒట్టిపోయినవని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. దుగ్గరాజు పట్నం ఓడరేవు నిర్మాణం కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమని తులసిరెడ్డి చెప్పారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు కావాలంటే తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని తులసిరెడ్డి కోరారు.

Tags:    

Similar News