జగన్ తో స్నేహమా..?

సమైక్యాంధ్ర కోసం పోరాడిన జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ ఎందుకు స్నేహం చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో [more]

Update: 2019-03-05 08:17 GMT

సమైక్యాంధ్ర కోసం పోరాడిన జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ ఎందుకు స్నేహం చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో, బయట రాష్ట్ర విభజన ఆపేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని కేసీఆర్ ఎందుకు సమర్ధిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం జగన్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన పేపర్ కటింగ్ లను, జగన్ పై కేటీఆర్, కవిత చేసిన ఆరోపణల కటింగ్ లను రావుల బయటపెట్టారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు నష్టం కాదా అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News