శ్రీరామనవమికి భక్తుల ముందు ఉంచుతాం

ఆంజనేయుడు జన్మస్థలంపై కమిటీ ఇచ్చిన నివేదికను శ్రీరామ నవమి రోజున భక్తుల ముందు ఉంచుతామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. టీటీడీ నియమించిన కమిటీ చారిత్రక [more]

Update: 2021-04-14 00:45 GMT

ఆంజనేయుడు జన్మస్థలంపై కమిటీ ఇచ్చిన నివేదికను శ్రీరామ నవమి రోజున భక్తుల ముందు ఉంచుతామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. టీటీడీ నియమించిన కమిటీ చారిత్రక ఆధారాలను సేకరించిందన్నారు. ఈ నెల 21వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఆ ఆధారాలను భక్తుల ముందు ఉంచుతామని చెప్పారు. తిరుపతిలోని అంజనాద్రి ఆంజనేయ జన్మస్థలమని కమిటీ తేల్చిందని జవహర్ రెడ్డి తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రజాభిప్రాయాన్ని కూడా కోరుతామని చెప్పారు.

Tags:    

Similar News