బ్రేకింగ్ : మూడు రాజధానులపై వచ్చే నెల 21వరకూ స్టేటస్ కో

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై హైకోర్టులో విచారణ ముగిసింది. వచ్చే నెల 21 వ తేదీ వరకూ మూడు రాజధానుల బిల్లుపై స్టే విధించింది. [more]

Update: 2020-08-27 06:31 GMT

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై హైకోర్టులో విచారణ ముగిసింది. వచ్చే నెల 21 వ తేదీ వరకూ మూడు రాజధానుల బిల్లుపై స్టే విధించింది. వచ్చ నెల 21వ తేదీ నుంచి రోజు వారీ విచారణను చేపడతామని హైకోర్టు పేర్కొంది. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలంటూ రైతుల తరుపున న్యాయవాదులు వాదించారు. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని పేర్కొన్నారు. దీనికి కౌంటర్ పిటీషన్ వేసేందుకు కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరారు. దీనిపై వచ్చేనెల 10వ తేదీన విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News