బ్రేకింగ్ : టీడీపీకి రాజీనామా చేస్తున్నా

తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా [more]

Update: 2019-09-13 10:53 GMT

తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన తోటట త్రిమూర్తులు వైసీపీలో చేరనున్నారు. ఎన్ని పార్టీలు మారానన్నది ముఖ్యం కాదని, అభివృద్ధే ముఖ్యమని తోట త్రిమూర్తులు అన్నారు. తోట త్రిమూర్తులుతో పాటు మరికొందరు కూడా వైసీపీలో చేరనున్నారు. కాగా చివరి నిమిషం వరకూ తోట త్రిమూర్తులు పార్టీని వీడకుండా ఉండేందుకు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Tags:    

Similar News