టీఆర్ఎస్ కు కరోనా షాక్.. వరసగా వ్యాధి బారిన

తెలంగాణలో ఒక మంత్రికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కి కరోనా పాజిటివ్ నమోదయింది. ఇందులో ఇద్దరు [more]

Update: 2020-06-29 05:54 GMT

తెలంగాణలో ఒక మంత్రికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కి కరోనా పాజిటివ్ నమోదయింది. ఇందులో ఇద్దరు చికిత్స పొంది కోలుకొని బయటకు వచ్చారు. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాలంలో పలు కార్యక్రమాల్లో ఆయనతో పాటు పాల్గొన్న వారందరూ కూడా క్వారంటైన్ క వెళ్లాలని అధికారులు సూచించారు. ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బిగాల గణేష్ గుప్తాలకు కరోనా పాజిటివ్ రావడంతో వారు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.

Tags:    

Similar News