విశాఖ రైల్వే జోన్ అమలుకు కాలపరిమితి లేదు

విశాఖ రైల్వే జోన్ అమలుపై ఎటువంటి కాలపరిమితి లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. దీనిపై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. [more]

Update: 2021-02-05 08:39 GMT

విశాఖ రైల్వే జోన్ అమలుపై ఎటువంటి కాలపరిమితి లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. దీనిపై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పియూష్ గోయల్ ఈ విషయం రాజ్యసభలో సమాధానంగా చెప్పారు. విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జోన్ ఏర్పాటు కోసం ఇప్పటికే ఓఎస్డీ స్థాయి అధికారి పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన ఇచ్చే నివేదికపైనే నిర్ణయం తీసుకుంటామని పియూష్ గోయల్ తెలిపారు.

Tags:    

Similar News