బ్రేకింగ్ : కడప జిల్లాలో భారీ పేలుడు పది మంది మృతి

కడప జిల్లా లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురాయి క్వారీలో జరిగిన ఈ ఘటనలో పదిమంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లిలో [more]

Update: 2021-05-08 05:39 GMT

కడప జిల్లా లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురాయి క్వారీలో జరిగిన ఈ ఘటనలో పదిమంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నలభై మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురాయిని పేల్చేందుకు ఉపయోగించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలిసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Tags:    

Similar News