బ్రేకింగ్ : యడ్డీకి గ్రీన్ సిగ్నల్

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోయి 48 గంటలు దాటినా ఇప్పటి వరకూ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత రాలేదు. బీజేపీ కూడా వేచి చూసే [more]

Update: 2019-07-26 04:31 GMT

కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోయి 48 గంటలు దాటినా ఇప్పటి వరకూ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత రాలేదు. బీజేపీ కూడా వేచి చూసే ధోరణిని వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరికాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు. ఈరోజే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.

Tags:    

Similar News