గెలుపెవరిదో ఇన్ డైరెక్ట్ గా చెప్పిన ‘ది హిందూ’

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ [more]

Update: 2019-05-22 07:32 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని తేల్చాయి. సీ ఓటర్, టుడేస్ చాణక్య, లగడపాటి రాజగోపాల్ సర్వేలు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవవచ్చని అంచనాలు వేశాయి. తాజాగా ప్రముఖ దినపత్రిక ‘ది హిందూ’.. సీడీసీఎస్ లోక్ నీతి సంస్థతో కలిసి నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది. అయితే, ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పకుండా.. ఏ పార్టీకి ఎంత ఓటు షేర్ వస్తుందో ఈ సంస్థ చెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు, టీడీపీకి 38 శాతం, కాంగ్రెస్ కు 5 శాతం, బీజేపీకి 7 శాతం ఓట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది.

Tags:    

Similar News