ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల జరగనున్నాయి. మార్చి 19వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ [more]

Update: 2021-03-10 01:14 GMT

ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల జరగనున్నాయి. మార్చి 19వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ సమావేశాల్లో 2021-2022 బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో జెండర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. 19వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నెలాఖరువరకూ జరిగే అవకాశాలున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు.

Tags:    

Similar News